పంట పొలాల్లో వివాహిత హత్య..

పంట పొలాల్లో వివాహిత హత్య..
x
Highlights

పంట పొలంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని అనంతరాయఏని సమీపంలో చోటుచేసుకుంది. దగదర్తి మండలం...

పంట పొలంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్‌ పరిధిలోని అనంతరాయఏని సమీపంలో చోటుచేసుకుంది. దగదర్తి మండలం కాటారాయపాడుకు చెందిన శేషమ్మ (40) తన స్వగ్రామమైన అనంతరాయఏనిలో జరుగుతున్న తిరునాళ్లను చూసేందుకు వచ్చింది. ఈ క్రమంలో తిరునాళ్ల చూసి తిరుగు ప్రయాణమైంది. అయితే సోమవారం అనంతరాయఏని సమీ ప పంట పొలాల్లో శవమై తేలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

బండ రాయితో మోది కత్తితో గొంతుకోసిన ఆనవాళ్లను గుర్తించారు. అక్క డే ఓ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవ ల భర్త మృతిచెందినట్లు బంధువులు చెబు తున్నారు. హత్యను ఛేదించేందుకు డాగ్‌స్క్వాడ్‌ రంగంలోకి దిగింది. మృతురాలు పడి ఉన్న ప్రదేశంలో తిరిగివచ్చిన డాగ్‌స్క్వాడ్‌ ఆత్మకూరు పట్టణం వైపునకు రావటంతో పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories