విశాఖ మన్యంలో మరోసారి అలజడి...డీజీపీ పర్యటన సమయంలోనే...

x
Highlights

ఏపీ డీజీపీ ఠాకూర్‌లో విశాఖ మన్యంలో పర్యటిస్తుండగానే మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ MKVB...

ఏపీ డీజీపీ ఠాకూర్‌లో విశాఖ మన్యంలో పర్యటిస్తుండగానే మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ MKVB కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న లేఖలను అంటించారు. గురుప్రియ సేతు బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలంటూ ఈ లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసి ఖనిజ సంపదను కార్పోరేట్లను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. బల్ల రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని తగ్గించాలంటూ లేఖలో కోరారు. డీజీపీ పర్యటన సమయంలోనే మావోయిస్టుల లేఖలు వెలియడంతో మరోసారి అలజడి రేగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories