హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య

హైదరాబాద్‌లో నడిరోడ్డుపై దారుణహత్య
x
Highlights

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ పిల్లర్‌ నెంబర్‌ 138 దగ్గర ఓ వ్యక్తిని నడిరోడ్డుపై అత్యంత దారుణంగా చంపేశారు....

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్తాపూర్‌లోని పీవీ ఎక్స్‌ప్రెస్‌ పిల్లర్‌ నెంబర్‌ 138 దగ్గర ఓ వ్యక్తిని నడిరోడ్డుపై అత్యంత దారుణంగా చంపేశారు. నలుగురు వ్యక్తులు వెంటాడి వేటాడి గొడ్డళ్లతో హత్య చేశారు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్నా.. పోలీసు వాహనం ముందే ఈ దారుణం జరగడం విచారకరం. రోడ్డుపై ఓ వైపు వాహనాలు వెళ్తుండగానే మరోవైపు ట్రాఫిక్‌ పోలీసు సహా. మరికొందరు అడ్డుకుంటున్నా.. అందరూ చూస్తుండగానే హత్య చేశారు. తనను రక్షించాలంటూ ఆ యువకుడు ఆర్తనాదాలు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. అక్కడున్న వారు రక్షించేందుకు ప్రయత్నించినా.. అవతలి వ్యక్తి చేతిలో గొడ్డలి ఉండడంతో భయపడుతూ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. దాడి చేసినవారిలో ఇద్దరిని ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడు రమేశ్‌గా గుర్తించారు. ఓ కేసులో ఏ వన్‌ నిందితుడిగా ఉన్నా రమేశ్‌ను నలుగురు వ్యక్తులు వేటాడి చంపేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories