నలుగురు ప్రియుళ్ళతో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య!

నలుగురు ప్రియుళ్ళతో కలిసి భర్తను కిరాతకంగా హత్య చేసిన భార్య!
x
Highlights

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ప్రియుళ్ళతో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన...

ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ప్రియుళ్ళతో కలిసి కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు.. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక, గోవా సరిహద్దు ప్రాంతానికి చెందిన బసురాజ్‌ బసు(38) తో గోవాకు చెందిన కల్పన బసు(31) కు ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరు గోవాలోని కుర్చోరెమ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బసురాజ్‌ టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కల్పనకు రాజస్థాన్ కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్ కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్ లతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం స్నేహితుడికి తెలిసి బసురాజ్‌ చెప్పాడు. దీంతో హతాశుడైన బసురాజ్‌ భార్య చేస్తున్న వికృత చేష్టలను మానుకోవాలని హెచ్చరించాడు. అయితే తన అనైతిక బంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే కారణంతో అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పధకం రచించింది కల్పన. అందులో భాగంగా తన ప్లాన్ ను నలుగురు ప్రియులకు చెప్పింది.ఈ క్రమంలో బసురాజ్‌ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి కాళ్ళు చేతులు కట్టేసి అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపారు. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి వేరు వేరు చోట్ల పడేశారు. మృతదేహాన్ని పడెయ్యడాన్ని కళ్లారా చూసిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు పరారీలో ఉండటం వలన కేసు దర్యాప్తు ఆలస్యమైంది. కాగా బుధవారం కల్పన బసు సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories