మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా

మల్లారెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా
x
Highlights

లోక్‌సభ పదవికి మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు. మేడ్చల్‌...

లోక్‌సభ పదవికి మల్కాజ్‌గిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు అందజేశారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లారెడ్డికి స్పీకర్ సుమిత్రా అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 87,990 ఓట్ల ఆధిక్యంతో మల్లారెడ్డి విజయం సాధించారు. తెలంగాణ కొత్త మంత్రి మండలిలో మల్లారెడ్డికి చోటు దక్కనుందని ప్రచారం జోరుగా సాగుతుంది. తాజాగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories