జనసేన అధినేత పవన్ కల్యాణ్ , క్రిటిక్ కత్తిమహేష్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కొత్తసంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు...
జనసేన అధినేత పవన్ కల్యాణ్ , క్రిటిక్ కత్తిమహేష్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కొత్తసంవత్సరం ప్రారంభంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ కల్యాణ్, జనసేన అభిమానులపై తన ప్రతాపాన్నిచూపిస్తూ ఓ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ పోస్ట్ కి అగ్నికి ఆజ్యం పోసేలా పవన్ కల్యాణ్ ను ఓ రాజకీయ జోకర్ గా అభివర్ణించాడు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానులు కత్తిమహేష్ కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ రాజకీయ జోకర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు. పవన్ ఓట్లు చీల్చేందుకు ఓ రాజకీయ జోకర్ లా పాలిటిక్స్ లోకి వచ్చారని దుయ్యబట్టాడు. అంతేకాదు 2019 ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే తాను అక్కడి నుంచే పోటీ చేసి ఆయన దిగజారుడు రాజకీయాల్ని ఎండగడతానని చెప్పాడు.
తిక్కసేన , పిచ్చి సేనానితో గత కొద్దికాలంగా పోరాడుతున్నానని అన్నాడు. తాను ఏ రివ్యూ రాసినా ..పవన్ కల్యాణ్ అభిమానులు అసభ్య పదజాలంతో దూషిస్తూ కామెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన అభిమానులు ఏం చేసినా పవన్ మాట్లాడడని గతంలో భార్య రేణూ దేశాయ్ పై కామెంట్ చేస్తే పట్టించుకోలేదు. తనని తిట్టిపోస్తే పవన్ స్పందిస్తాడా అంటూ ప్రశ్నించాడు. 'కత్తి మహేష్పై దాడిని ఆపండి' అంటూ పవన్ ఒక్క ట్వీట్ చేసినా... దీనికి ముగింపు పడుతుందని కత్తి మహేష్ చెప్పుకొచ్చాడు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire