ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్ గా ఉన్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తాజాగా మరో...
ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పై, ఆయన అభిమానులపై విమర్శలతో విరుచుకుపడి, నాలుగైదు రోజులుగా సైలెంట్ గా ఉన్న సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ తాజాగా మరో ట్వీట్ చేశాడు. జనవరి 15 వరకూ సైలెంట్ గా ఉంటే ఆ తరువాత సమస్య పరిష్కారం అవుతుందన్న నిర్మాత కోన వెంకట్ సలహాను పాటిస్తున్నానని చెప్పిన ఆయన, గత రాత్రి ఓ ట్వీట్ వదిలాడు. `ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దం చేస్తాయి. నిజాల కోసం జనవరి 16 వరకు ఆగండి` అని ట్వీట్ చేశాడు. కాగా, సంక్రాంతికి విడుదలైన `అజ్ఞాతవాసి`, `జైసింహా` సినిమాలపై కత్తి మహేష్ రివ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలైన 'అజ్ఞాతవాసి', ఓ చెత్తి సినిమా అని కత్తి రివ్యూ ఇచ్చిన తరువాత, పవన్ అభిమానులు ఆయనపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సినిమా థియేటర్లే ఏ చిత్రం భవిష్యత్తు ఏంటన్న విషయం చెబుతాయన్న అర్థం వచ్చేలా కత్తి ట్వీట్ వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి.
Empty vessels make much noise. Wait till 16th Jan for the truth.
— Mahesh Kathi (@MaheshhKathi) January 12, 2018
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire