జ‌న‌వ‌రి 26న మ‌హేష్ బాబు ‘ఫస్ట్ ఓత్’

జ‌న‌వ‌రి 26న మ‌హేష్ బాబు ‘ఫస్ట్ ఓత్’
x
Highlights

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పంథా మార్చింది. కొత్త సినిమా ట్రైల‌ర్ల‌ను విడుద‌ల చేయాలంటే మారు పేరుతో విడుద‌ల చేసి కావాల్సినంత ప‌బ్లిసిటీని పొందుతున్నారు. గ‌తంలో...

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ పంథా మార్చింది. కొత్త సినిమా ట్రైల‌ర్ల‌ను విడుద‌ల చేయాలంటే మారు పేరుతో విడుద‌ల చేసి కావాల్సినంత ప‌బ్లిసిటీని పొందుతున్నారు. గ‌తంలో బాల‌కృష్ణ - డైర‌క్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ డైర‌క్ట‌న్ లో పైసా వ‌సూల్ అనే చిత్రాన్ని నిర్మించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేస్తూ..దాన్ని ట్రైల‌ర్ అని పిల‌వ‌కుండా స్టంప‌ర్ అనే పేరుతో విడుద‌ల చేసి ఆక‌ట్టుకున్నారు. ఆ త‌రువాత అల్లు అర్జున్ - వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ టీజర్‌ని ఫస్ట్ ఇంపాక్ట్ అనే టైటిల్‌తో విడుదల చేసి మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాడు. ఇప్పుడు వీరి బాట‌లో ప్రిన్స్ మ‌హేష్ బాబు వ‌చ్చి చేరాడు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు - కొర‌ట‌లా ద‌ర్శ‌క‌త్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా లో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ‘ఫస్ట్ ఓత్’ అంటూ ఓ చిన్న హింట్ ఇచ్చారు. ‘ఫస్ట్ ఓత్’ అనేది ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఆ రోజు విడుదల చేస్తున్నామని చెప్పడానికి వారు ‘ఫస్ట్ ఓత్’ అనే కొత్త పదాన్ని వాడారు. ఈ సినిమాకి రిలేటెడ్‌గా ఉన్న ఈ ఓత్ ఎలా ఉండబోతుందో తెలియదు కానీ.., ‘ఫస్ట్ ఓత్’ అంటూ వారు విడుదల చేసిన పోస్టర్‌కి మాత్రం సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories