తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సహకరించలేదు..అందుకే ఓడిపోయా!: కూటమి నేత

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు సహకరించలేదు..అందుకే ఓడిపోయా!: కూటమి నేత
x
Highlights

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనను చాలా మోసం చేశారంటూ మహాకూటమి వైరా అభ్యర్ధి విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. మహాకూటమి...

ఇటివల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు తనను చాలా మోసం చేశారంటూ మహాకూటమి వైరా అభ్యర్ధి విజయసాయి సంచలన ఆరోపణలు చేశారు. మహాకూటమి పొత్తు ధర్మానికి సరిగ్గా కట్టుబడి కాంగ్రెస్ నేతలు సహకరించి ఉంటే వైరాలో తప్పకుండా గెలుపుబావుట ఎగిరేసేవాళ్లమని విజయసాయి తెలిపారు. కాంగ్రెస్ నేతలు నాకు సహకరించకుండా స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ కే పూర్తి మద్దతు ఇచ్చారని వాపోయారు. అయినా ఇప్పుడు ఎం జరిగిందో తెలుసుగా ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారని పేర్కోన్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనా, నైతిక విజయం తనదేనని బానోత్ విజయసాయి స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా కాని తనకు మాత్రం 32.000 ఓట్లు పోల్ ీఅయ్యాయని ఇకపై వైరా ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతనని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories