ప్రేయసిని చంపి.. పెళ్లిపీటలెక్కాడు!

ప్రేయసిని చంపి.. పెళ్లిపీటలెక్కాడు!
x
Highlights

ప్రియురాలిని వంచించి, ఆమెను హతమార్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళికట్టిన ఓ మోసగాడు, ఆ మర్నాడే పోలీసులకు పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లాలో...

ప్రియురాలిని వంచించి, ఆమెను హతమార్చిన మరుసటి రోజే మరోయువతి మెళ్లో తాళికట్టిన ఓ మోసగాడు, ఆ మర్నాడే పోలీసులకు పట్టుబడిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన బొడ్డుపల్లి లక్ష్మయ్య కూతురు భార్గవి (23) డిగ్రీ వరకు చదివింది. ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో పని చేస్తోంది. బుజిలాపురం గ్రామానికి చెందిన కాసగాని సత్తయ్య కుమారుడు నరేందర్‌ అలియాస్‌ నరేశ్‌ కొన్నాళ్లు ఓ పెట్రోలు పంపులో పనిచేసి మానేశాడు. కులాలు వేరైనా ఇద్దరూ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నరేందర్‌కు నాలుగేళ్ల క్రితమే వివాహమైంది. ఏవో కారణాలు చెప్పి.. పెళ్లయిన 15రోజులకే ఆమెను వదిలించుకున్నాడు. అయినా నరేందర్‌ను భార్గవి నమ్మింది.

తనను పెళ్లిచేసుకుంటాడని ఆశించిన ఆమెకు నరేందర్‌ మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమవడం కలిచివేసింది. నరేందర్‌ కుటుంబ సభ్యులు మరో యువతితో ఆదివారం (ఈనెల 4న) పెళ్లిని నిర్ణయించారు. దీనిపై భార్గవి.. నరేందర్‌ను నిలదీసింది. పెద్దలకు తెలియకుండా పెళ్లిచేసుకుందామంటూ నమ్మించిన నరేందర్‌.. శనివారం భార్గవిని బుజిలాపురం సమీపంలోని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్యచేసి, వ్యవసాయ బావి వద్దగల మొరం కుప్పలో గోతి తవ్వి పూడ్చి వేశాడు. ఏమీ తెలియనట్టుగా ఇంటికి వచ్చి ఆదివారం పెద్దలు కుదిర్చిన యువతి మెడలో తాళికట్టాడు.

ఇంతలో భార్గవి కనిపించడం లేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి, నరేందర్ పై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పెళ్లయిన మరుసటి రోజు పోలీసులు నరేందర్ ను విచారించగా, తన పెళ్లికి అడ్డుగా ఉండడంతోనే భార్గవిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో తన వ్యవసాయ బావివద్ద గల మొరం గడ్డ వద్ద గుంతతీసి మృతదేహాన్ని పాతిన ప్రదేశాన్ని చూపెట్టాడు. మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు, నరేందర్ ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపారు.

lover murder in Bhuvanagiri District - Sakshi

Show Full Article
Print Article
Next Story
More Stories