ఖజానాకు ఎన్నికల కిక్కు...అంచనాలను మించిన మద్యం అమ్మకాలు

ఖజానాకు ఎన్నికల కిక్కు...అంచనాలను మించిన మద్యం అమ్మకాలు
x
Highlights

అందుబాటులో మందు పధకం.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నేతలు మందునే నమ్ముకున్నారు అడిగిన వాళ్లు అడిగినంత పోస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు...

అందుబాటులో మందు పధకం.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కొంతమంది నేతలు మందునే నమ్ముకున్నారు అడిగిన వాళ్లు అడిగినంత పోస్తూ ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు దీని ఫలితంగా అంచనాలను మించిన మద్యం అమ్మకాలు జరిగాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో పెరిగాయి గతంతో పోల్చితే ఈ పెరుగుదల సగటున 20 శాతంగా నమోదైంది. ఇంటింటికీ మందు అందిస్తే ఇబ్బందులు అని భావించిన అభ్యర్థులు దుకానాల్లోనే ఖాతాలు పెట్టేశారు వారి ఖాతాలో మద్యం తీసుకొని తాగే విధానాన్ని ప్రారంభించారు ఇక ఎన్నికల నేపథ్యంలో రోజూ తాగే బ్రాండు తాగేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఖరీదైన మద్యాన్ని తాగేందుకే ఇష్టపడుతున్నారు. దీంతో మద్యం దుఖానాల్లో రెట్టింపు అమ్మకాలు సాగుతున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో రాష్ట్రంలో గుడుంబా పూర్తిస్థాయిలో నిర్మూలించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో తక్కువ ధర మద్యం కంటే ఎక్కువ ధర ఉండే మద్యం సీసాల వినియోగం భారీగా పెరిగింది. ఒక్క బీరు అమ్మకాలే 20శాతం వరకు పెరిగింది యువకులు విదేశీ మద్యాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తునట్లు తెలుస్తోంది. పోలింగ్ సందర్భంగా 7వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మొత్తానికి ఎన్నికల కారణంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగింది మరి ఎవరికి కిక్కు నిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories