అశ్లీల ఫోటోపై కుల్దీప్‌ ట్వీట్..

అశ్లీల ఫోటోపై కుల్దీప్‌ ట్వీట్..
x
Highlights

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్ గా రాణిస్తున్న కుల్ దీప్ యాదవ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దానిలో అశ్లీల ఫోటోలు ఉంచారు. ఇన్...

భారత క్రికెట్ జట్టులో ప్రధాన బౌలర్ గా రాణిస్తున్న కుల్ దీప్ యాదవ్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దానిలో అశ్లీల ఫోటోలు ఉంచారు. ఇన్ స్టాగ్రామ్ లో కుల్ దీప్ కు 3 లక్షల మందికి పైగా అభిమానులు ఫాలోవర్లుగా ఉండగా, సైబర్ నేరగాళ్ల పని గురించి తెలియని వారంతా, తమ ఫేవరెట్ క్రికెటర్ ఇలాంటి ఫోటో పెట్టాడేంటని అవాక్కవగా, దీనిపై కుల్ దీప్ ట్విట్టర్ మాధ్యమంగా వివరణ ఇచ్చాడు. సైబర్ నేరగాళ్లు తన అకౌంట్ను హ్యాక్ చేసి ఓ అశ్లీల ఫొటోను పోస్ట్ చేశారని, అందుకు తనను క్షమించాలని కోరాడు. తన పాస్‌వర్డ్‌ను మరింత భద్రంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని, అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని ట్వీట్ చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories