ఛీ..నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది.. సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నావ్..: నటి కృతిసనన్ పై నెటిజన్ల ఆగ్రహం

ఛీ..నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది.. సమాజానికి ఏం మెస్సేజ్ ఇస్తున్నావ్..: నటి కృతిసనన్ పై నెటిజన్ల ఆగ్రహం
x
Highlights

‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతిసనన్ నెటిజనుల ఆగ్రహానికి గురవుతోంది. ఛీ.. నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల్ల...

Image result for kriti sanon ‘1 నేనొక్కడినే’ హీరోయిన్ కృతిసనన్ నెటిజనుల ఆగ్రహానికి గురవుతోంది. ఛీ.. నిన్ను చూస్తేనే సిగ్గేస్తోంది అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల్ల సమాజానికి ఏం మస్సేజ్ ఇవ్వదలుచుకున్నావ్ అంటూ నిలదీస్తున్నారు. అంతలా నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది కృతిసనన్ ఓ మ్యాగిజీన్ కు ఇచ్చిన ఫొటోషూట్... దానికథేంటంటే....

కాస్మోపాలిటన్ ఇండియా మ్యాగజీన్ తన ఆగస్టు ఇష్యూలో భాగంగా ఇంగ్లండ్ లోని ఓ మ్యూజియంలో కృతితో ఫొటోషూట్ నిర్వహించింది. వేలాడుతున్న జిరాఫీని పట్టుకుని కృతి సనన్ డిఫరెంట్ యాంగిల్ లో ఇచ్చిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వీటిని కాస్మో ఇండియా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన మ్యాగజీన్ కవర్ పేజీ కోసం పోస్టు చేసిన ఈ ఫొటోలను పొందుపరస్తూ.. ‘ ఈ జిరాఫీకి ఎటువంటి హానీ కలగలేదు.. ఎందుకంటే.. అది బతికున్న జిరాఫీ కాదు’ అంటూ క్యాప్షన్ జతచేసింది.

అంతటితో ఆగకుండా చనిపోయిన మూగ జీవాలను సదరు మ్యూజియంలో పొందుపరుస్తారని పేర్కొంటూ... వాటిపై పరిశోధనలు జరిపేందుకు అనుమతి కూడా ఇస్తారంటూ తెలిపింది. ఈ ఫొటోలను చూసిన జంతు ప్రేమికులు కాస్మో ఇండియా, కృతిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఛీ.. పబ్లిసిటీ కోసం మూగ జీవాలను సైతం వాడుకుంటారా.. మిమ్మల్ని చూస్తే సిగ్గేస్తోంది.’ అంటూ మండిపడ్డారు. అసలు ఈ ఫొటో ద్వారా ఏం సందేశమిద్దామనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఒక్క ఫొటోతో కృతి ఆలోచనలు కూడా ఏవిధంగా ఉంటాయో అర్థమవుతోంది అంటూ ఆగ్రహిస్తున్నారు. ఇది ఖచ్చితంగా నేరమేనంటూ.. చర్యలు తీసుకోవాల్సిందిగా..’పెటా‘ కోరుతానంటూ మరొకరు హెచ్చరించారు.

Kriti Sanon sticks her neck out

Show Full Article
Print Article
Next Story
More Stories