‘తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదు’

x
Highlights

జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు చేశామన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అనేక...

జేఏసీగా ఉన్న రోజుల్లోనే రాజకీయ పార్టీపై సమాలోచనలు చేశామన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అనేక మంది మేధావులతో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. నిరంకుశ పాలనను అంతమొందించడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పాటు చివరి మజిలీ కాదని, అది తొలిమెట్టని అన్నారు. తెలంగాణలో తాము ఆశించేది సామాజిక మార్పు అని కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రజలకోసం పోరాడగలిగే కొత్తతరం నాయకత్వం అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ అభ్యర్థుల గెలుపుపై పూర్తి విశ్వాసం ఉందని కోదండరాం ఆశాభావం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories