లగడపాటి సర్వేపై కేసీఆర్‌ పరోక్ష విమర్శలు..

లగడపాటి సర్వేపై కేసీఆర్‌ పరోక్ష విమర్శలు..
x
Highlights

తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడినవారు ఇప్పుడు సర్వేల పేరుతో తెరపైకి వస్తున్నారని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. భూపాలపల్లి సభలొ కెసిఆర్...

తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడినవారు ఇప్పుడు సర్వేల పేరుతో తెరపైకి వస్తున్నారని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. భూపాలపల్లి సభలొ కెసిఆర్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాంటి పిచ్చి పిచ్చి సర్వేలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సారి తెలంగాణ ఎన్నికలపై తన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్న లగడపాటి రాజగోపాల్‌ను పరోక్షంగా కేసీఆర్‌ విమర్శించారు. కావాలనే ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఇలాంటి సర్వేలు చేస్తారని కేసీఆర్‌ విమర్శించారు. ఎన్నికల వేళ గిసొంటోళ్లు మస్తుగా మాయామాటల సర్వేల పేరుతో జనాలను ఆగం ఆగం చేద్దామని ప్రయత్నం చేస్తారు దయచేసి మీరు గిస్మోంటి ఉత్తమాటలు నమ్మోద్దని కెసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories