తుపాను బాధితుల కోసం ముందుకొచ్చిన కౌశల్

తుపాను బాధితుల కోసం ముందుకొచ్చిన కౌశల్
x
Highlights

పెథయ్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలవిల లాడింది. రైతులను నిండా మంచింది. కొందరి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాగా పెథయ్ తుపాను...

పెథయ్ తుపాను ధాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విలవిల లాడింది. రైతులను నిండా మంచింది. కొందరి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాగా పెథయ్ తుపాను వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు నేను సైతం సిద్ధంగా ఉన్నట్లు బిగ్ బాస్-2 విజేత కౌశల్ స్పష్టం చేశారు. తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని సముద్ర తీర ప్రాంతాల్లో భారీగా నష్టం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తుపాను బాధితులను ఆదుకునేందుకు కౌశల్ ముందుకు వచ్చారు. అలాగే బాధితులను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కౌశల్ పిలుపునిచ్చారు. విజయవాడలో ప్రమాన్ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన కౌశల్ మీడియాతో వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుపాను వల్ల నష్టపోయిన బాధితులకు నష్టంపరిహరం చెల్లిస్తానని హమీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories