నందమూరి సుహాసిని గురించి స్పందించిన ఎన్టీఆర్

నందమూరి సుహాసిని గురించి స్పందించిన ఎన్టీఆర్
x
Highlights

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలిసి...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పోలింగ్ బూత్ లో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో కలిసి ఎన్టీఆర్ పోలింగ్ సెంటర్ కు వచ్చారు. 40 నిమిషాలు క్యూలైన్ లో వేచి ఉండి ఎన్టీఆర్ ఓటేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలని ఎన్టీఆర్ కోరారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగం, దేశం మనకు కల్పించిన హక్కు ఇది. ఆ హక్కును అందరూ వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోతే కంప్లైంట్ చేసే హక్కు లేదు. ఓటు వేయాలనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు... మనసా, వాచా, కర్మణా మనకు అనిపించాలి. నేను చెప్పాల్సింది ఒక్కటే. అక్క గెలవాలని మాత్రం కోరుకుంటున్నా’’ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories