తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ...
తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఐపీఎల్-11, 2018 ఫైనల్ మ్యాచ్ కోసం ఈ కొత్త ఆఫర్ అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. రూ. 101 రీచార్జి చేసుకుంటే 4జీ స్మార్ట్ఫోన్లకు 4 రోజులపాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చని జియో ప్రకటించింది. ఈ కాంప్లిమెంటరీ ఆఫర్ ఎంపిక చేసిన జియో యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.
అయితే ఈ ప్యాక్లో ఎలాంటి కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ ప్రయోజనాలను జియో అందించడం లేదు. కేవలం డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. మై జియో యాప్ను ఓపెన్ చేసుకుని మై ప్లాన్స్ సెక్షన్లో మీకు ఈ కొత్త ఆఫర్ అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆఫర్ మీకు అందుబాటులో ఉంటే, రూ.101తో ఈ ప్రయోజనాలను పొందవచ్చని జియో పేర్కొంది. రోజులో ఆఫర్ చేసే లిమిట్ అయిపోతే, 64కేబీపీఎస్ స్పీడులో ఈ అపరిమిత యాక్సస్ను పొందవచ్చు. ఈ డేటా ద్వారా యూజర్లు క్రికెట్ మ్యాచ్ లైవ్ వీడియోని ఆస్వాదించవచ్చు. క్రికెట్ ప్యాక్గా తీసుకొచ్చిన ఈ ఆఫర్, బ్రౌజింగ్, స్ట్రీమింగ్, డౌన్లోడింగ్ కోసం కూడా వాడుకోవచ్చు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire