రేపు చెన్నైలో పర్యటించనున్న పవన్.. కీలక ప్రకటన చేసే అవకాశం

x
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు చెన్నైలో పర్యటించనున్నారు. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన చెన్నై వెళ్తున్నట్టు సమాచారం. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్టు సమాచారం. రేపు మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు హోటల్‌ కన్నెమోరాలో ప్రెస్‌మీట్‌ పెట్టనున్న పవన్‌ కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories