‘జైసింహా’ ఫ‌స్టాఫ్ రివ్యూ

‘జైసింహా’ ఫ‌స్టాఫ్ రివ్యూ
x
Highlights

‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్...

‘జైసింహా’తో సంక్రాతి బ‌రిలోకి దిగిన బాల‌కృష్ణ సినిమా ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని క‌నువిందు చేసిన‌ట్లు తెలుస్తోంది. బాల‌కృష్ణ హీరోగా కేఎస్ ర‌వికుమార్ డైర‌క్ష‌న్ లో జైసింహా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మ‌రి ఈ చిత్రం ఫ‌స్టాఫ్ లో అభిమానుల్ని ఏమేర‌కు అల‌రిస్తుంద‌నే విష‌యాన్ని తెలుసుకుందాం.
ఫస్టాఫ్
విశాఖ‌ప‌ట్నంలో ఉండే న‌ర‌సింహా (బాలకృష్ణ) గౌరి(నయనతార)కి తెలియకుండా ఆమె కొడుకుని తీసుకుని అక్క‌డి నుంచి
దేవాల‌యాల‌కు ప్ర‌సిద్ధి చెందిన కుంభకోణం అనే ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఓ దేవాల‌యం ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉన్న (మురళీమోహన్‌) ఇంట్లో డ్రైవర్ గా స్థిర‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో ఆలయ ధర్మకర్త కుమార్తె ధాన్య(నటాషా దోషి) యాక్సిడెంట్ నేరాన్ని త‌న‌పై వేసుకోవ‌డం. ఏసీపీని ఎదిరించ‌డంతో అత‌నితో శత్రుత్వం పెంచుకోవడం, విశాఖ‌లో ఉన్న గౌరి త‌న కొడుకుకోసం కుంభ‌కోణం చేరుకోవ‌డంతో న‌ర‌సింహా కు విప‌త్క‌ర పరిస్థితులు ఎదుర‌వుతాయి. మ‌రి ఈ ప‌రిస్థితుల‌నుంచి న‌ర‌సింహా ఎలా త‌ప్పించుకున్నాడు. న‌ర‌సింహా,బాల‌కృష్ణ మ‌ధ్య సంబంధం ఏంటో ఫ‌స్టాఫ్ లో తెలిసిపోతుంది.
ఎలా ఉందంటే
కేఎస్ ర‌వికుమార్ చాలా కాలం త‌రువాత తెలుగులో బాల‌కృష్ణ‌తో ‘జైసింహా’ తెర‌కెక్కించాడు. ఈ సినిమా ఫ‌స్టాఫ్ బాల‌కృష్ణ నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అది అందించిన‌ట్లు తెలుస్తోంది. కేఎస్ ర‌వికుమార్ టేకింగ్ లో ఇర‌గ‌దీశాడ‌ని..ముఖ్యంగా బాల‌య్య యాక్ష‌న్ సీన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. వీటితో పాటు బ్రాహ్మణుల గురించి బాలకృష్ణ చెప్పే డైలాగులు బ్ర‌హ్మానందం కామెడీకి విప‌రీత‌మైన రెస్పాన్స్ వ‌స్తుంద‌ని టాక్ . ఇక అమ్మ‌కుట్టి పాట‌లో తనదైన డ్యాన్సులతో అభిమానుల్ని క‌నువిందు చేశాడు. ఓవ‌ర్ ఆల్ గా ఫ‌స్టాఫ్ లో సినిమాని ఓ రేంజ్ కు తీసుకెళ్లాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories