దాయాదిని ‘శత’కొట్టారు

దాయాదిని ‘శత’కొట్టారు
x
Highlights

ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌.. దాయాధి పాక్ ను చిత్తు చేసింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి మళ్లీ ఫైనల్లోకి అడుగు...

ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌.. దాయాధి పాక్ ను చిత్తు చేసింది. పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసి మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది.ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. షోయబ్‌ మాలిక్‌ (90 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (66 బంతుల్లో 44; 2 ఫోర్లు) రాణించాడు. బుమ్రా, కుల్దీప్, చహల్‌ తలా 2 వికెట్లు తీశారు. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 39.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 238 పరుగులు చేసి విజయాన్నందుకుంది. శిఖర్‌ ధావన్‌ (100 బంతుల్లో 114; 16 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (119 బంతుల్లో 111 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీలతో చెలరేగారు. 114 పరుగులు చేసిన ధావన్ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. ధావన్‌ , రోహిత్ లు కలిసి తొలి వికెట్‌కు 210 పరుగులు జోడించి గెలుపును సునాయాసం చేశారు. ఇక చివరి సూపర్‌–4 మ్యాచ్‌లో భారత్‌ మంగళవారం అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories