మహానటి ఇంటిని వేలం వేస్తున్నారు!

మహానటి ఇంటిని వేలం వేస్తున్నారు!
x
Highlights

హీరోయిన్లు.. నటీమణులు చివరి దశలో ఇబ్బంది పడి కాలం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు.. శ్రీవిద్య విషయంలోనూ అదే జరిగింది.. ఇప్పుడు ఆమె గుర్తులను...

హీరోయిన్లు.. నటీమణులు చివరి దశలో ఇబ్బంది పడి కాలం చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు.. శ్రీవిద్య విషయంలోనూ అదే జరిగింది.. ఇప్పుడు ఆమె గుర్తులను కూడా కాలగర్భంలో కలిపేసే ప్రయత్నం జరుగుతోంది. తెలుగులోనే కాదు.. తమిళ, మళయాళ సినిమాల్లోనూ అద్భుతమైన కేరెక్టర్లు చేసి.. అభిమానులను సంపాదించుకున్న శ్రీవిద్య.. పద్ధతైన నటనకు.. నిండైన రూపానికి కేరాఫ్ గా నిలిచారు. అలాంటి శ్రీవిద్య.. చివరి దశలో కేన్సర్ తో ఇబ్బంది పడ్డారు. కేరళ శాసనసభ్యుడు గణేష్ కుమార్.. అప్పట్లో ఆమె బాగోగులు చూసుకున్నారు.

ఆమెకు చెన్నై అభిరామపురంలోని సుబ్రమణియపురంలో రెండు అంతస్తుల ఇల్లు ఉంది. శ్రీవిద్య మరణం తర్వాత.. ఆ ఇంటి బాగోగులు చూసేవాళ్లు కరువయ్యారు. కనీసం ఇంటి పన్ను కూడా చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కానీ.. అక్కడ ఓ డ్యాన్స్ స్కూల్ నిర్వహిస్తున్నారు. దాంతో వచ్చే అద్దెను.. ఇన్నాళ్లూ ఆదాయ పన్ను శాఖ జమచేసుకుంటూ వచ్చింది. కానీ.. అది పన్ను మొత్తానికి సమానం కాకపోవడంతో.. ఓ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 27న శ్రీవిద్య ఇంటిని వేలం వేసేందుకు నిర్ణయించారు. ధరను.. ఒక కోటి 17 లక్షల 20 వేల రూపాయలుగా నిర్ణయించారు. వేలంలో అంతకంటే ఎక్కువ పలికే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఇలా.. ఒక మహానటి అవసాన దశలో.. అనుకోని రీతిలో అంతర్థానం అవడమే కాదు.. ఆఖరికి ఆమె గుర్తులు కూడా ఇలా విషాదకరమైన పరిస్థితుల్లో చెరిగిపోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories