కేసీఆర్‌ను పర్సనల్‌గా కలుస్తా: రాజాసింగ్

కేసీఆర్‌ను పర్సనల్‌గా కలుస్తా: రాజాసింగ్
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరులో టీఆర్ఎస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా రెండోసారి అధికారంలోకి అడుగుపెడుతూ నేడు సిఎం కెసిఆర్...


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరి పోరులో టీఆర్ఎస్ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా రెండోసారి అధికారంలోకి అడుగుపెడుతూ నేడు సిఎం కెసిఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడం కుదరలేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. హల్ మొత్తం పూర్తిగా నిండిపోయిందన్నారు. ప్రమాణస్వీకారం పూర్తికాగానే కెసిఆర్ వెళ్లిపోయారని అన్నారు. తప్పకుండా కెసిఆర్‌తో టైమ్ తీసుకుని పర్సనల్‌గా కలిసి శుభాకాంక్షలు తెలుపుతానని అన్నారు. గడిచిన ఈ నాలుగేండ్లలో తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లినట్లే రానున్న ఐదేళ్లపాటు తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ కృషి చేయాలని ఆంకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories