కిల్లర్ వైఫ్..మొగుడిని ప్రియుడితో హత్య చేయించిన ఇల్లాలు

x
Highlights

హైదరాబాద్ లో నాగర్ కర్నూల్ స్వాతి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో భర్తను ప్రియుడు, అతడి ఫ్రెండ్స్ కలిసి హత్య చేయించింది భార్య. పోలీసు కేసుకు...

హైదరాబాద్ లో నాగర్ కర్నూల్ స్వాతి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో భర్తను ప్రియుడు, అతడి ఫ్రెండ్స్ కలిసి హత్య చేయించింది భార్య. పోలీసు కేసుకు భయపడి ఓ నిందితుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసు విచారణలో కసాయి భార్య గుట్టురట్టయింది.

హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో కార్పెంటర్ నాగరాజు, జ్యోతి దంపతులు నివాసం ఉంటారు. కొద్ది నెలలతో జ్యోతి కార్తీక్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం నాగరాజుకు తెలిసింది. భార్యభర్తల మధ్య తగాదాలు వచ్చాయి. తన సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త అడ్డు తొలగించుకునేందుకు జ్యోతి ప్లాన్ వేసి లవర్ కార్తీక్ కు సుపారి ఇచ్చింది. గత నెల 31 తేదీ రాత్రి ఇంట్లో నాగరాజును ముగ్గురు స్నేహితులతో కలిస కార్తీక్ హత్య చేశాడు. శవాన్ని జిల్లెల చెల్క చెరువులో పడేశారు.


నాగరాజును కార్తీక్ , నరేష్ , దీపక్ , యాసిన్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అన్న మందలించడంతో నరేష్ పోలీసులకు లొంగిపోవడానికి లాలాగూడ పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. పోలీసు దెబ్బలకు భయపడి నరేష్ గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. వెంటనే అతడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నాగరాజు హత్యపై నరేష్ ను పోలీసులు ప్రశ్నించగా భర్తను ప్రియుడితో చంపించిన కసాయి భార్య జ్యోతి ఉదంతం వెలుగులోకి వచ్చింది. మృతదేహాం పడేసిన జిల్లెల చెల్క చెరువు వద్దకు నరేష్ ను తీసుకెళ్లి పోలీసులు విచారించారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులు ను అరెస్ట్ చేశారు. లాలాగూడ పోలీసులు తో పాటు చౌటుప్పల్ పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన కర్మన్ ఘాట్ ఏరియాలో కలకలం సృష్టించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories