ప్రభాస్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ప్రభాస్‌ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
x
Highlights

తన గెస్ట్‌హౌస్‌ సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభాస్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు...

తన గెస్ట్‌హౌస్‌ సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రభాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభాస్‌ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు సీఎస్‌-7లో ప్రభుత్వ భూమి ఉందా? లేదా? అని ప్రశ్నించింది. అయితే, తాము కొనుగోలు చేసింది రాయదుర్గంలోని పాన్‌మక్తా స్థలమేనని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. మరోవైపు పాన్‌ మక్తా భూముల వ్యవహారంపై గతంలో తీర్పునిచ్చిన డివిజన్‌ బెంచ్‌కు కేసును బదిలీ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఈ కేసును సింగిల్‌ బెంచ్‌ నుంచి డివిజన్‌ బెంచ్‌కు బదిలీ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ప్రభాస్‌ గెస్ట్‌ హౌస్‌ సీజ్‌పై రేపు డివిజన్‌ బెంచ్‌లో విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories