పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని...

తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని న్యాయస్థానం స్పష్టం చేసింది. పంచాయతీ పాలక వర్గాల గడువు ఈ ఏడాది ఆగస్టులో ముగియడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. ఓటర్ల జాబితా, బీసీ రిజర్వేషన్ల అంశాలపై ప్రతిపక్షాలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. తాజాగా హై కోర్టు ఉత్తర్వులతో పంచాయతీ రాజ్ శాఖ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈ నెల 13 నుంచి 14 వరకు గ్రామాల్లో బీసీ ఓటర్ల జాబితాను ప్రచురించాలని పంచాయతీరాజ్‌శాఖ నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories