బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయ్ : బీజేపీ

x
Highlights

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన...

బీజేపీతోనే ఏపీకి నిధులు, సంస్థలు వచ్చాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఏపీ ప్రజలను రాజకీయ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ పార్టీతో ఏపీకి న్యాయం జరగలేదని బీజేపీతోనే ఏపీ ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. గత ప్రధాని ఇచ్చిన చాలా హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్న జీవీఎల్‌ ఏపీపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారన్న ఆయన చేతనైనంత సాయం కేంద్రం చేస్తోందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories