ప్లీజ్ నన్ను చంపకండి... మన పిల్లలంటే నాకు ప్రాణం : దీపికా

ప్లీజ్ నన్ను చంపకండి... మన పిల్లలంటే నాకు ప్రాణం : దీపికా
x
Highlights

'ప్లీజ్ నన్ను చంపకండి... మన పిల్లలంటే నాకు ప్రాణం' అని వేడుకున్నా భార్యను కిరాతకంగా హతమార్చాడో వ్యక్తి. ప్రియురాలి మోజులో పడి ఈ దారుణానికి...

'ప్లీజ్ నన్ను చంపకండి... మన పిల్లలంటే నాకు ప్రాణం' అని వేడుకున్నా భార్యను కిరాతకంగా హతమార్చాడో వ్యక్తి. ప్రియురాలి మోజులో పడి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురుగ్రాం లో జరిగింది. గురుగ్రాం ప్రాంతానికి చెందిన విక్రమ్ చౌహాన్(35), దీపికా చౌహాన్(32) దంపతులు. వీరికి కూతురు(5) ఐదు నెలల బాబు ఉన్నారు. కొంతకాలంగా విక్రమ్‌ వేరే మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని దీపికా చౌహాన్ కు తెలిసింది. దాంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా భార్య వున్నదని భావించి ఆమెను ఎలాగైనా అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో దంపతులమధ్య ఈ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఇంట్లో ఎవరు లేని సమయం చూసి భార్య దీపికను బాల్కనీలోకి బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను కిందకు తోసేశాడు. దాంతో దీపిక అక్కడిక్కడే మృతి చెందింది. ఆ సమయంలో తనను చంపొద్దంటూ.. పిల్లలంటే తనకు ప్రాణం అని దీపిక అతన్ని వేడుకుంది. అయినా.. అతను వినకుండా బలవంతంగా దీపికను కిందకు తోసేశాడు. ఆ తరువాత 'నా భార్య కిందపడిపోయింది.. కాపాడండి' అంటూ డ్రామాలు ఆడాడు. దీపిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మొదట ఈ కేసును అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. దర్యాప్తులో భర్తే నిందితుడు అని తేలడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories