దూసుకొస్తున్న మరో తుఫాను.. ఆ ప్రాంతాలకు హెచ్చరిక..

దూసుకొస్తున్న మరో తుఫాను.. ఆ ప్రాంతాలకు హెచ్చరిక..
x
Highlights

ఇప్పటికే టిట్లి తుఫాను మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. ఈ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లా వాసులు కొంతమంది సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తో...

ఇప్పటికే టిట్లి తుఫాను మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. ఈ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లా వాసులు కొంతమంది సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచివుందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చించి. శనివారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఆదివారం మరింత బలపడి తుపానుగా మారనుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్రల వైపు పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో 13వ తేదీ నుంచి దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దాంతో తీరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేటలో ఉన్న మత్స్యకారులు వెనక్కి రావాలని సూచించింది. కాగా ఈ తూఫానుకు 'గజ' అనే పేరును సూచించినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories