దుంకా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్లు జైలు శిక్ష

దుంకా ట్రెజరీ కేసులో లాలూకు ఏడేళ్లు జైలు శిక్ష
x
Highlights

బీహార్ దాణాస్కాం నాలుగో కేసులో.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు.. 30 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. 3 కోట్ల 18 లక్షల...

బీహార్ దాణాస్కాం నాలుగో కేసులో.. లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అంతేకాదు.. 30 లక్షల జరిమానా కూడా విధించింది కోర్టు. 3 కోట్ల 18 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలో లాలూకు ఈ శిక్ష పడింది. దాణా స్కాం కేసుల్లో.. ఇప్పటివరకు లాలూకు 20 ఏళ్ల 6 నెలల శిక్ష పడింది. ఇక.. ఇదే కేసులో బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాను కోర్టు నిర్దోషిగా తేల్చింది. దుంకా ట్రజరీ కేసులో రాంచీ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. దాణా కుంభకోణంలో ఇది నాలుగవ కేసు. ఈ స్కామ్‌లో 3.13 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. డిసెంబర్ 1995 నుంచి 1996 వరకు దుంకా ట్రెజరీ నుంచి ఆ నిధులను స్వాహా చేశారు. 1990లో బీహార్ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories