నిలిపివున్న రైల్లో మంటలు..

నిలిపివున్న రైల్లో మంటలు..
x
Highlights

నిలిపి ఉన్న రైల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటన ముంబైలోని షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది....

నిలిపి ఉన్న రైల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది ఆందోళన చెందారు. ఈ ఘటన ముంబైలోని షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకుంది. మంగళవారం ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే యార్డులో నిలిపివున్న షోలాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగి నుంచి పెద్ద ఎత్తున మంటలతో పొగ బయటకు రావడంతో అధికారులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories