భార్య కాపురానికి రావడం లేదని భర్త చేసిన పని చూస్తే!

భార్య కాపురానికి రావడం లేదని భర్త చేసిన పని చూస్తే!
x
Highlights

భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు భార్య సోదరుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి...

భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు భార్య సోదరుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది.ఆగ్రా ఫిరోజాబాద్ జిల్లా రసూల్ పురా గ్రామానికి చెందిన సౌరబ్ (29) కు రత్నేష్ (27)తో నాలుగేళ్ళక్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా భార్యభర్తల మధ్య కలతలు రేగాయి. భార్య రత్నేష్ ను నిత్యం వేధించడమే కాకుండా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. ఈ క్రమంలో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన రత్నేష్ కుమారుడుతో సహా తన పుట్టింటికి వెళ్ళింది. అయితే ఆమె ఎన్నిరోజులకూ తిరిగిరాకపోవడంతో సౌరబ్ ఆమెకోసం అత్తగారింటికి వెళ్ళాడు.భార్యను తనఇంటికి రమ్మని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో భార్యను ఎలాగైనా పుట్టింటికి రప్పించాలన్న ఉద్ద్యేశంతో రత్నేష్ సోదరుడు దేవేంద్రను కిడ్నాపర్లకు సఫారీ ఇచ్చి కిడ్నాప్ చేయించాడు. ఆపై చిత్రహింసలకు గురిచేశాడు. తన ఇంటికి రాకపోతే నీ సోదరుడిని చంపేస్తానని బెదిరించాడు. అల్లుడి బెదిరింపులకు భయాందోళనచెందిన అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీ రైల్వేస్టేషనులో గుర్తించి కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. నిందితుడైన సౌరభ్ పరారీలో ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories