పెథాయ్‌ ఎఫెక్ట్‌ : తీరం తాకిన పెథాయ్ తుపాను

పెథాయ్‌ ఎఫెక్ట్‌ : తీరం తాకిన పెథాయ్ తుపాను
x
Highlights

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటలకు 80...

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటలకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తీర ప్రాంతాల్లోని ఆరువేల మందిని ఇప్పటికే తుపాను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories