పంటపొలంలోనే ఆగిన రైతు గుండె

పంటపొలంలోనే ఆగిన రైతు గుండె
x
Highlights

పెథాయ్‌ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించిన పంట నష్టాన్ని చూసి తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే నెలకొరిగాడు....

పెథాయ్‌ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించిన పంట నష్టాన్ని చూసి తట్టుకోలేక ఓ రైతు పొలంలోనే నెలకొరిగాడు. తుపాను దెబ్బకు తడిసిన వరి పంటను చూసి గుండెలాగి కుప్పకూలిపోయాడు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన గొట్టిపల్లి చిన్న(70) అనే రైతు పొలంలో నిలిచిపోయిన వర్షపు నీటిని బయటకు పంపడానికి కాలువ తీస్తున్నాడు. పార పట్టుకుని పొలంలో బట్టీ వేస్తుండగానే గుండె పోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయి గుండెనొప్పితో వరి పొలంలోనే ప్రాణాలు వదిలాడు. కాగా గొట్టిపల్లి చిన్నవాడుకి ఓ భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories