తీరంలో ఇరుక్కుపోయిన మంత్రి గంటా కారు

తీరంలో ఇరుక్కుపోయిన మంత్రి గంటా కారు
x
Highlights

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటకు 80...

పెథాయ్ తుపాను తీరం తాకింది. తూర్పుగోదావరి జిల్లాలోని తాళ్లరేవు - కాట్రేనికోన మధ్యలో సరిగ్గా మధ్యాహ్నం 12.15గంటలకు తీరం తాకింది. దీంతో తీరంలో గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షణకు వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు కారు తీరంలో ఇసుకలో ఇరుక్కుపోయింది. భీమిలి బీచ్ దగ్గర్లోని మంగమర్రిపేట వద్ద తీరంలో గంటా కారు ఇసుకలో ఇరుక్కుపోయింది. దీంతో ఆయన రక్షణ సిబ్బంది కారును బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories