బెజవాడలో ఫ్లెక్సీల కలకలం

బెజవాడలో ఫ్లెక్సీల కలకలం
x
Highlights

విజయవాడలో ప్రధాని మోడీ ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర రాజకీయ దుమారం...

విజయవాడలో ప్రధాని మోడీ ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంజ్ సర్కిల్, పాత బస్టాండ్, సచివాలయం సమీపంలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పాలనను మోడీ మరిపిస్తున్నారన్న అక్షరాలు ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం పై ప్రసంగించేందుకు టీడీపీకి కేవలం 13 నిముషాలు కేటాయినచ్చడం పై నిరసన వ్యక్తం చేసిన ఆయన కాంగ్రెస్‌కు పట్టిన గతే రేపు బీజేపీకి పడుతుందంటూ హోర్డింగ్స్లపై రాయించారు. ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి లేకుంటే జాతి మిమ్మల్ని క్షమించదు” అంటూ కాట్రగడ్డ ప్లెక్సీ ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ ప్లెక్సీలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే ఫ్లెక్సీలు తొలగించాలని బీజేపీ నేతల డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories