పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం : హోంమంత్రి

x
Highlights

ఖాకీ వర్సెస్‌ ఖద్దర్‌గా మారిన తాడిపత్రి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా జేసీ, పోలీసుల వ్యాఖ్యలపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. పోలీసులపై జేసీ...

ఖాకీ వర్సెస్‌ ఖద్దర్‌గా మారిన తాడిపత్రి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా జేసీ, పోలీసుల వ్యాఖ్యలపై హోం మంత్రి చిన రాజప్ప స్పందించారు. పోలీసులపై జేసీ వ్యాఖ్యలు అనుచితం అని వ్యాఖ్యానించారు. పోలీసు వ్యవస్థపై దివాకర్‌రెడ్డి తీరు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్న హోంమంత్రి.. ఒక ఎంపీగా ఉండి ప్రభుత్వ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. ఇటు నాలుకలు కోస్తామంటూ ఆవేశంగా మాట్లాడిన పోలీసు సంఘం తీరును కూడా ఆయన తప్పుబట్టారు. వారి వ్యాఖ్యలు కూడా సమర్థనీయం కాదన్న చిన రాజప్ప రాష్ట్రంలో పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories