అతడితో బ్రేకప్‌.. పెళ్లిపై ఆశ లేదు

అతడితో బ్రేకప్‌.. పెళ్లిపై ఆశ లేదు
x
Highlights

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలిగారు ఛార్మి. ‘శ్రీ ఆంజనేయం’, ‘మాస్‌’, ‘చక్రం’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’ ‘మంత్ర’ తదితర చిత్రాల్లో...

ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికల్లో ఒకరిగా వెలిగారు ఛార్మి. ‘శ్రీ ఆంజనేయం’, ‘మాస్‌’, ‘చక్రం’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘రాఖీ’ ‘మంత్ర’ తదితర చిత్రాల్లో నటించి తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఛార్మి..పూరీ కనెక్ట్స్‌ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు సినిమాలు చేయడం లేదు వంటి విషయాలను ఓ ఆంగ్ల ప్రతికతో పంచుకున్నారిలా.

ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించానని.. అయితే రెండు విషయాల వల్ల ఆ ప్రేమ విఫలమైందని.. వాటిని తలొగ్గి చేసుకున్నా తాను విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చేదని ఛార్మీ తెలిపింది. అంతేకాదు "అతడు మంచివాడు, కానీ నేనే చెడ్డదాన్ని, పెళ్లి తరువాత ఆయన కోసం సమయం కేటాయించలేను. ఇంటి పనులు చూసుకోలేను. అసలు మా రిలేషన్‌షిప్‌లోనే స్పష్టత లేకపోయింది, అందుకే విడిపోయాం" అని చెప్పింది. ఇక తనకు పెళ్లిపై నమ్మకం లేదని.. ఒక అబ్బాయిని చూసి ఇష్టపడే స్టేజ్‌లో తాను లేనని.. ఈ విషయాలన్నీ తన తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారని, అందుకే వారితో ఉండేందుకే ఇష్టపడతానని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories