అందరూ చూస్తుండగానే కొట్టుకుపోయాడు!

x
Highlights

కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మైసూరులోని చుంచనకట్టె వాటర్‌ ఫాల్స్‌లో ఓ సైంటిస్ట్‌...

కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మైసూరులోని చుంచనకట్టె వాటర్‌ ఫాల్స్‌లో ఓ సైంటిస్ట్‌ గల్లంతయ్యాడు. సైంటిస్ట్‌తో పాటు మరో ముగ్గురు విహారయాత్రకు వచ్చి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో సైంటిస్ట్‌ వరద నీటిలో కొట్టుకుపోయాడు.

వరద నీటిలో కొట్టుకుపోయిన సైంటిస్ట్‌ను సోమశేఖర్‌గా గుర్తించారు. సోమశేఖర్‌... కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో సీనియర్‌ సైంటిస్ట్‌గా పని చేస్తున్నాడు. వీకెండ్‌లో ఉల్లాసంగా గడిపేందుకు కుటుంబ సభ్యులతో కలిసి చుంచనకట్టె జలపాతానికి వచ్చాడు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో సోమశేఖర్‌ నదిలో కొట్టుకుపోయాడు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories