భర్త మర్మాంగాలను కొరికి.. లవర్‌తో పరారైంది

భర్త మర్మాంగాలను కొరికి.. లవర్‌తో పరారైంది
x
Highlights

ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూశాడని... భర్త అంగాన్ని కొరికి ముక్కలు చేసిందో భార్య! తమిళనాడు పోలీసులు శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. ఈ సంఘటన...

ప్రియుడితో సన్నిహితంగా ఉండటాన్ని చూశాడని... భర్త అంగాన్ని కొరికి ముక్కలు చేసిందో భార్య! తమిళనాడు పోలీసులు శుక్రవారం ఈ వివరాలను వెల్లడించారు. ఈ సంఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. సెంతామరై(55), జయంతి(45) అనే దంపతులు కలిసి ఆదివారం దేవాలయానికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఓ కార్యక్రమం నిమిత్తం గ్రామంలోకి వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటలకు భర్తను అక్కడే వదిలి కాస్త విశ్రాంతి తీసుకొని వస్తానని చెప్పి జయంతి వెళ్లింది.

ఆమె వెళ్లి సుమారు గంట సమయం అయినప్పటికీ తిరిగి రావడం లేదు. అనుమానం వచ్చిన భర్త.. భార్య కోసం వెతకడం ప్రారంభించాడు. గ్రామానికి సమీపంలో తన ప్రియుడితో జయంతి సన్నిహితంగా ఉండటం చూశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సెంతామరై.. వారిద్దరిని గ్రామంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సెంతామరై లుంగీ ఊడిపోవడంతో.. ఆయన మర్మాంగాలను భార్య కొరికేసింది. అనంతరం తన లవర్‌తో జయంతి పరారైంది. తీవ్ర రక్తస్రావం అవుతున్న సెంతామరైను గ్రామస్తులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జయంతితో పాటు ఆమె ప్రియుడిని బుధవారం అరెస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories