అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నా: బైరెడ్డి

x
Highlights

ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని అది కాంగ్రెస్‌తోటే సాధ్యమని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు...

ఏపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నారని అది కాంగ్రెస్‌తోటే సాధ్యమని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. అందుకే తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీ, వైసీపీలు బీజేపీతో కుమ్మక్కై తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయన్నారు బైరెడ్డి. శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారు. కర్నూల్‌ జిల్లాకు చెందిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. గతంలో టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి రాయలసీమ హక్కుల కోసం పోరాటం ప్రారంభించిన విషయం తెల్సిందే! మరోవైపు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తర్వాత సీమ నుంచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న సెకండ్ పొలిటికల్ నేత బైరెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories