ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది మృతి

ఘోర బస్సు ప్రమాదం.. 25 మంది మృతి
x
Highlights

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్య జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి... పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ...

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాండ్య జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి... పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోగా... మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ బస్సులో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులే ఉండడంతో మృతుల్లో కూడా వారి సంఖ్య ఎక్కువగా ఉంది. మాండ్య నుంచి పాండవపుర ప్రాంతానికి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు... కనగణమరడి గ్రామంలోకి రాగానే అదుపు తప్పి కావేరి నది వీసీ కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో దాదాపు 20 మంది స్కూల్ పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు అదుపుతప్పడానికి కారణమైనమని ప్రత్యేక్ష సాక్ష్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories