పెళ్లిపందిట్లోనుంచి వధువు జంప్‌.. వరుడు చేసిన పని చూస్తే..

పెళ్లిపందిట్లోనుంచి వధువు జంప్‌.. వరుడు చేసిన పని చూస్తే..
x
Highlights

సరిగ్గా పెళ్లి ముహూర్తానికి గంట సమయం ఉందనగా పెళ్లికుమార్తె పెళ్లిపందిట్లోనుంచి జారుకుంది. ఈ క్రమంలో వరుడు పెళ్ళికి వచ్చిన బంధువులకు షాక్ ఇచ్చాడు....

సరిగ్గా పెళ్లి ముహూర్తానికి గంట సమయం ఉందనగా పెళ్లికుమార్తె పెళ్లిపందిట్లోనుంచి జారుకుంది. ఈ క్రమంలో వరుడు పెళ్ళికి వచ్చిన బంధువులకు షాక్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని కడలూరు మండలం బన్రుట్టి గ్రామానికి చెందిన అళగేశన్‌ పూలవ్యాపారం చేసేవాడు.. ఇతనికి సోమకోట గ్రామానికి చెందిన రంజితం(24)తో జూన్‌ 4న పెళ్లి చే నిశ్చయించారు. దీంతో పందిట్లో బంధువులు పెళ్లిహడావుడిలో పడి పెళ్లికూతురు ఉందొ లేదో కూడా మరచిపోయారు. సరిగ్గా తాళికట్టడానికి గంటముందు రంజితం పారిపోయింది. ఈ క్రమంలో ఇరువురిమధ్య తోపులాట జరిగింది. విసుగు చెందిన వరుడు బంధువుల అమ్మాయిని ఆ పందిట్లోనే వివాహం చేసుకున్నాడు. పైగా ఆమెను అలంకరించకుండా ముహూర్తం దాటిపోతుందేమోనని అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించకుండా వివాహం చేసుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. ఇంతలో కట్నం విషయమై మొదటి పెళ్లి వారు అళగేశన్‌ పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఇదిలావుంటే రంజితం తనకు ఈ పెళ్లి ఇష్టంలేక వెళ్లిపోయిందా లేక ఎవరితోనైనా వెళ్లిపోయిందా అనే విషయంపై స్పష్టత రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories