మోదీ పాలనపై దేశంలో వ్యతిరేకత...తేల్చి చెప్పిన ఏబీపీ న్యూస్-సీఎస్‌డీఎస్ సర్వే

మోదీ పాలనపై దేశంలో వ్యతిరేకత...తేల్చి చెప్పిన ఏబీపీ న్యూస్-సీఎస్‌డీఎస్ సర్వే
x
Highlights

మన దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక సీట్లు వస్తాయి? ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ? నరేంద్ర మోడీ కి ప్రజల్లో ప్రస్తుతం...

మన దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధిక సీట్లు వస్తాయి? ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది ? నరేంద్ర మోడీ కి ప్రజల్లో ప్రస్తుతం ఆదరణ ఎలా ఉంది? కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ప్రజాకర్షణ ఎంత శాతం పెరిగింది ? తదితర అంశాలపై ఓ సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి . ఎన్డీయే కూటమికి 274 సీట్లు, యూపీఏ కూటమికి 164 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ప్రజాకర్షణ విషయంలో మోడీ గ్రాఫ్ పడిపోతున్నట్లు స్పష్టమయింది. గతంలో ఉన్నంత ప్రజాధరణ లేదని స్పష్టమయింది.

సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్...సీఎస‌డీఎస్, ఏబిపి న్యూస్ అనే సంస్థలు సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండనుందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాయి. బిజెపికి గడ్డు కాలం మొదలయిందనే సంకేతాలు ఈ సర్వే ఇచ్చింది. త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని, బిజెపిని ప్రజలు తిరస్కరించనున్నట్లు సర్వే పేర్కొంది. రాజస్థాన్ లో కాంగ్రెస్ కి బిజెపి కన్నా 5 శాతం అధికంగా ఓట్లు పొలయ్యే అవకాశం ఉందని, అదే విధంగా మధ్య ప్రదేశ్ లో బిజెపి కంటే కాంగ్రెస్ కు 15 శాతం ఓట్లు అధికంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

దేశంలో 19 రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 నుంచి మే 17 వరకు దాదాపు 15 వేల మంది అభిప్రాయాలను సేకరించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్లు స్పష్టమయింది. దళితులు, మైనార్టీలు మరోసారి నరేంద్ర మోడీకి అధికారం కట్టబెట్టేందుకు సిద్ధంగా లేరని సర్వే స్పష్టం చేసింది. అదే విధంగా దేశంలో ఉన్నత కులాలకు చెందిన వారు, ఓబిసీ వర్గాలు నరేంద్ర మోడీకి మరోసారి అధికారం అప్పజెప్పేందుకు సుముఖంగా ఉన్నాయి. మరోవైపు సీట్ల విషయంలో ఎన్డీయే కూటమి యూపీఏ కూటమి కంటే ముందంజలో ఉంది. ఎన్డీయే కూటమికి 274 సీట్లు వచ్చే అవకాశం ఉండగా, యూపీఏ కూటమికి 164 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి 282 స్థానాలు గెలుపొంది స్పష్టమైన మెజార్టీ సాధించింది.ఎన్డీయే కూటమికి 336 సీట్లు వచ్చాయి. ఈ సారి పరిస్థితులు ఆ విధంగా లేవని సర్వే స్పష్టం చేసింది. కూటమి మొత్తం సీట్లు 274కి పరిమితం కానున్నట్లు తెలిసింది.

ఉత్తరాదిలో ఎన్డీయే కూటమికి 90 సీట్లు వచ్చే ఛాన్స్ ఉంటే, దక్షిణాదిలో 18 నుంచి 22 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని సర్వే తెలిపింది. మరోవైపు యూపీఏ కూటమికి దక్షిణాదిలో మంచి పట్టున్నట్లు స్పష్టమయింది. దక్షిణాదిలో మొత్తం 67 నుంచి 75 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉత్తరాదిలో మాత్రం యూపీఏ కూటమి కేవలం 25 స్థానాలకు మాత్రమే పరిమితం కానుంది సర్వే స్పష్టం చేసింది.

వ్యక్తిగతంగా కూడా మోడీ ప్రభ నానాటికీ తగ్గుతున్నట్లు సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. నరేంద్ర మోడీని, రాహుల్ గాంధీని ఇష్టపడేవారు 43 శాతంగా ఉన్నట్లు సీఎస‌డీఎస్, ఏబిపి న్యూస్ సర్వే తెలిపింది. రాహుల్ గాంధీ తన ప్రత్యర్ధులను సైతం ప్రసన్నం చేసుకుంటుంటే, నరేంద్ర మోడీ స్నేహితులను సైతం కోల్పుతున్నట్లు సర్వే స్పష్టం చేసింది. 2017 మేలో మోడీ ప్రజాకర్షణ శక్తి 44 శాతం ఉండగా, 2018 జనవరిలో 37 శాతానికి పడిపోయింది. తాజా ఈ గ్రాఫ్ 34 శాతానికి పడిపోయింది. దేశంలో కీలకమైన ఉత్తర ప్రదేశ్లో కూడా బిజెపికి గడ్డుకాలం మొదలయిందని సర్వే తెలిపింది. 2014లో 53 శాతం ఓట్లతో 80 స్థానాల్లో 71 స్థానాలు సాధించిన బిజెపి ఈ సారి ప్రజల నమ్మకాన్ని కోల్పోయినట్లు సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఉత్తర ప్రదేశ్ లో మాత్రం కేవంల 35 శాతం ఓట్లు మాత్రమే బిజెపికి వస్తాయని సర్వే తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories