బీజేపీ సంచలన నిర్ణయం... రాష్ట్రంలో గవర్నర్ పాలనకు రంగం సిద్ధం?

బీజేపీ సంచలన నిర్ణయం... రాష్ట్రంలో గవర్నర్ పాలనకు రంగం సిద్ధం?
x
Highlights

జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయింది. జమ్మూకశ్మీర్‌‌లో ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మద్దతు...

జమ్మూ కశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ మధ్య బంధం ముగిసిపోయింది. జమ్మూకశ్మీర్‌‌లో ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు. మద్దతు ఉపసంహరిస్తూ...గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రాకు లేఖను పంపారు. బీజేపీ మంత్రులతో అమిత్ షా చర్చించిన తర్వాత...మద్దతు ఉపసంహరించుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా రాష్ట్రంలో గవర్నర్ పాలనకు ఆదేశాలు వెలువడతాయని సమాచారం. ఈ పరిణామాలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ ఇది ఎప్పుడో జరగవలసిందని, ఇది ఊహించిన పరిణామమేనని చెప్పారు. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు తీవ్రంగా పెరిగిపోయిన నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories