బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట

బోఫోర్స్ కేసులో కాంగ్రెస్‌కు ఊరట
x
Highlights

భోఫోర్స్‌ కేసులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. ఈ కేసులో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సీబీఐ...

భోఫోర్స్‌ కేసులో కాంగ్రెస్ కు ఊరట లభించింది. ఈ కేసులో హిందుజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అయితే సీబీఐ వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హిందూజా సోదరులతోపాటు ఇతర నిందితులను గతంలో ఢిల్లీ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అయితే, ఈ ఉత్తర్వులను సీబీఐ సుప్రీంలో సవాల్‌ చేసింది. సీబీఐ వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. సీబీఐ ఆలస్యంగా అప్పీల్‌ చేసిందని అందుకు చెప్పిన కారణాలు కూడా సహేతుకంగా లేవని ధర్మాసనం పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories