కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్

కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన పాక్ క్రికెటర్
x
Highlights

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్ అజమ్‌ బ్రేక్ చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ 58...

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డును పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్ అజమ్‌ బ్రేక్ చేశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ 58 బంతుల్లో 78 పరుగులు సాధించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 48 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ఈ ఓపెనర్‌.. వేగవంతంగా వెయ్యి పరుగులు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లి 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధిస్తే.. బాబర్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు చేసి ఇప్పటివరకు కోహ్లీ పేరిట ఉన్న రికార్డును బ్రేక్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టు 47 పరుగులతో విజయం సాధించి 3-0తో కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్‌ తన ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. ప్రశుతం విండీస్ టీ20 సిరీస్‌కు కోహ్లీ విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆస్ట్రేలియా పర్యటనకు కోహ్లీ సిద్దమవుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories