హైదరాబాద్‌‌లో నడిరోడ్డుపై కొట్టుకున్న అత్తాకోడళ్లు

హైదరాబాద్‌‌లో నడిరోడ్డుపై కొట్టుకున్న అత్తాకోడళ్లు
x
Highlights

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అత్తా కోడళ్లు నడిరోడ్డు మీద కలబడ్డారు. గల్లాలు పట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విడిపించేందుకు...

నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో అత్తా కోడళ్లు నడిరోడ్డు మీద కలబడ్డారు. గల్లాలు పట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విడిపించేందుకు వచ్చిన చుట్టుపక్కల వారిపై చిందులు వేశారు. స్ధానికంగా ఉన్న శివపార్వతి థియేటర్ దగ్గర ఈ గొడవ జరిగింది.

మీర్‌పేటకు చెందిన సింహాద్రికి నర్సరావుపేటకు చెందిన శిరీషతో ఎనిమిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే అత్త వేధిస్తోందని ఆరోపించిన శిరీష భర్త, పిల్లలను వదిలి కూకట్‌పల్లిలోని తమ ప్రాంత వాసులతో కలిసి కూలీ పని చేస్తూ జీవించేది. తోటి వారితో కలిసి సినిమా చూసేందుకు తన కోడలు వచ్చిందని తెలుసుకున్న సింహాద్రి తల్లి ... థియేటర్‌ దగ్గర మాటు వేసి శిరీషను అడ్డుకుంది. కాపురానికి రావాలంటూ బలవంతం చేసింది. అయితే తాను కాపురానికి వచ్చేది లేదంటూ కోడలు శిరీష తెగేసి చెప్పడంతో అత్త దాడికి దిగింది. నడిరోడ్డుపైన పిడిగుద్దులు కురిపించింది. తనతో పాటు తెచ్చుకున్న మద్యం సీసా పగులగొట్టి దాడికి దిగింది. ఈ ఘటనలో శిరీష చెల్లెలకు స్వల్పగాయాలయ్యాయి. స్ధానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని అరెస్ట్ చేయడంతో పరిస్దితి సద్దుమణిగింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories