ప్రపంచాన్ని కంట‌త‌డి పెట్టిస్తున్న ఆర్మీ మహిళా అధికారి

ప్రపంచాన్ని కంట‌త‌డి పెట్టిస్తున్న ఆర్మీ మహిళా అధికారి
x
Highlights

సోషల్ మీడియాలో ఆర్మీ మహిళా అధికారి కుముద్ డోగ్రా, ఆమె ఐదు రోజుల కుమార్తెకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారి అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ ఆర్మీ...

సోషల్ మీడియాలో ఆర్మీ మహిళా అధికారి కుముద్ డోగ్రా, ఆమె ఐదు రోజుల కుమార్తెకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారి అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ ఆర్మీ అధికారికి నెటిజన్లు సలాం కొడుతున్నారు. మేజర్‌ కుముద్‌ దోగ్రా భర్త, భారత ఏయిర్‌ఫోర్స్‌ అధికారి, వింగ్‌ కమాండర్‌ డీవాట్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ క్రాష్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 15న అస్సాం మజులీ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన మరణించిన రెండు రోజులకే కుముద్‌ దోగ్రా ఓ పాపకు జన్మనిచ్చింది. గత బుధవారం డీవాట్స్‌ అంతక్రియలు జరగగా ఆమె తన ఐదు రోజుల పాపతో హజరయ్యారు. కుముద్‌ దోగ్రాకు సెల్యూట్‌ అంటూ ట్విటర్‌లో ఈ ఫొటోను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. దేశం కోసం భారత్‌ సైన్యం ఎలాంటి త్యాగం చేస్తుందో అనడానికి ఈ ఘటన ఓ నిదర్శనమని ఒకరు, ఆర్మీని విమర్శించే వారంత ఈ ఘటనను చూసి బుద్దితెచ్చుకోవాలని ఇంకొకరు ఆమెకు మద్దతుగా పోస్ట్‌లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories