తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై చంద్రబాబు ట్వీట్

తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలపై చంద్రబాబు ట్వీట్
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరుగుతున్న ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. తెలంగాణలో ఓటు ఉన్న...

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరుగుతున్న ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. తెలంగాణలో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఇవాళ తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వేసే ప్రతి ఓటు ఎంతో మార్పు తీసుకొస్తుందని గ్రహించాలని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉదయం ట్వీట్‌ చేశారు. మరోవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories